Wednesday, February 9, 2011

హాల్లో కామ్రేడ్


ఉదాయన్నే నిద్ర లేచి చూసేసరికి అంతా కొత్త గా అనిపించింది నాకు. మర్చే పోయాను. కొత్త వూరు కదూ......


ఇల్లంతా తిరిగి చూశాను. ఎటు చూసిన ఎరుపు రంగే. "తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలిలెవ్వరు ?" ఏదో వినబడుతూ ఉంది... అంత లో పొడుగ్గా, సన్నగా ఉన్న ఒక ఆకారం నా ముందు ఉంది. కెవ్వుమన్నాను!!! హాల్లో కామ్రేడ్! చుట్టూ చూశాను. ఎవరినా అని. నిన్నే అన్నట్టు నా భుజం మీద చెయ్యి వేసిందా ఆకారం. నా పేరు సుబ్బా రావు. నన్ను అందరు   కామ్రేడ్ సుబ్బారావు అంటారు అని పరిచయం చేసుకున్నారు. తరువాత తెలిసింది ఆయన ఆ ఇంటి ఓనర్ అని. చిన్నప్పటి నుంచి ఉద్యమ కారుడట.ఉద్యమం అంటే ఏంటి? అదుగుదామ్ అనుకున్నాను. మళ్లీ నాకెందుకులే. అసలే చిన్న పిల్లాడినీ అని వూరుకున్నాను. 


                         ఆయన భార్య పేరు అరుణ. ఆవిడ కూడా అంతే నట. అయిన ఇవన్ని నాకు ఎందుకు. హాయిగా నోరు పుక్కిలించి వూసి సాయి బాబు తో పాటు పాలు తాగడానికి తయారు అయ్యాను. ఏరా! పళ్ళు తోముకోవా ? అని పెదబాబు అడిగాడు. లేదన్నాను.  అయినా వాళ్ళ పిచ్చి కానీ మా వూళ్ళో అయితే మేము పెంచే గొర్ర పిల్లలు పళ్ళు తోముకుంటాయ ఏంటి ? అయినా అవి పాలు తాగట్లేదా ? ఆకులు నమాలట్లేదా ? ఇదంతా చెప్పి వీళ్ళకి కూడా కొంచెం జ్ఞానం ఇద్దాం అనుకున్నా కానీ, అప్పటికే ఆకలి. చేసేది లేక వాళ్ళు చూపించినట్టే చేసి పాలు తాగాను.



సాయి బాబు ఎంత సేపు బతిమాలినా పాలు తాగట్లేదు. చూసి చూసి బేబమ్మ గారు ఆ గ్లాసు నా చేతికి ఇచ్చి తాగించమని చెప్పి టిఫిన్ చేయడానికి లోనికి వెళ్లారు. సాయికి ఆ కబుర్లు ఏ కబుర్లు చెప్పా... ఉహు!! తాగట్లేదు. నవ్విద్డామని కుక్క పిల్లలా అరిసాను. నవ్వతూన్నాడు కానీ ఏమీ లాభం లేదు. అటు ఇటు చూశాను. ఎవరు లేరు. ఆ అయినా ఆకలెస్తే ఇంత సేపు ఎవరినా తాగకుండా ఉంటారా ఏంటి ? గుటుక్కున తాగేశాను.  మళ్లీ పెద్ద వాళ్ళకి అనుమానం వస్తుంది ఏమో అని ఒక వేలు గ్లాసులో పెట్టి కొన్ని పాలు తీసి బాబు మూతికి పూసాను. 


                        అంతలో బేబమ్మ వచ్చి గ్లాసులో చూస్తే పాలు అన్ని అయిపోయాయి. నన్ను ఎంత మురుసుకున్నారో... ఒక్క చుక్కా కూడా లేకుండా మొత్తం బాబు తో తాగించానని. హ్హి హ్హి! పాపం వీళ్ళకేం తెలుసు!


అప్పటికీ బొజ్జ నిండింది.

No comments:

Post a Comment